Home / జాతీయం
దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. గ్యాస్ బండ ధరను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. అది కూడా వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొనింది.
చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.
గుజరాత్ లో రూ. 25కోట్ల 80 లక్షల రూపాయల నకిలీ రెండు వేల రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని ఓ అంబులెన్సు మాటున తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.
కర్ణాటకలోని బెళగావిలో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి ప్రియుడితో హత్య చేయించింది. దీనికి గాను ఆమె ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసిందని సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ హత్యకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం.
దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన పై క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో దీపక్ షెనాయ్ స్పందించారు. ఇది "చెడు నిర్ణయం". కోవిడ్ ముగిసినందున ఉచితంగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 2023 నుండి ప్యాసింజర్ వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్బ్యాగ్లను కేంద్రం తప్పనిసరి చేసింది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్లో తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు.