Home / జాతీయం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్లో తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు.
డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ మరియు సరఫరాతో సంబంధం ఉన్న వ్యక్తుల పై భారీ దాడిలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) భారతదేశంలోని అనేక ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. యాంటీ డ్రగ్స్ ఆపరేషన్కు సంబంధించి సుమారు 175 మందిని అరెస్టు చేసింది.
ప్రముఖ గిన్నీస్ వరల్ట్ రికార్డుల గాయకుడు గజల్ శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. సంగీత స్వరమాధురి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం గజల్ శ్రీనివాస్ కు లభించింది. లతా మంగేష్కర్ జన్మ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.
భారత్ జోడో యాత్రను తలపెట్టిన కాంగ్రెస్ ను అడ్డుకొనేందుకు అధికార భాజాపా శ్రేణులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ 1న రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో ప్రవేశించనున్న నేపథ్యంలో స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను భాజాపానే చింపేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
నకిలీ పత్రాలు, వ్యక్తులతో చేసిన మోసపూరిత రిజిష్ట్రేషన్లను రద్దు చేసే చట్టానికి స్టాలిన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది
ఇంతవరకూ అప్పులు చేయడంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డుల దిశగా సాగుతోందని భావిస్తున్నారు. అయితే తాజాగా మరో విషయంలో కూడా ఏపీ రికార్డు సృష్టించింది. అదేమిటంటే గత ఏడాది దేశ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో అత్యధిక శాతం ఏపీదే కావడం విశేషం.
బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు.
జమ్ముకశ్మీర్లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.