Home / జాతీయం
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో ఒకే రోజు 5,379 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దీనితో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,44,72,241 కు చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 50,594కి తగ్గాయి. 27 మరణాలతో కోవిడ్ మరణాల సంఖ్య 5,28,057కి చేరుకుంది.
ఏపీ, తెలంగాణలో ప్రముఖ రాజకీయ ముఖ్య నేతలు అయిన చంద్రబాబు నాయుడు మరియు సీఎం కేసీఆర్ లకు హర్యానా రాష్ట్రం ఆహ్వానం పలికింది. ఈ నెల 25న భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) భారీ ర్యాలీ నిర్వహించనుంది.
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా 5008 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్స్ లేదా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టులను భర్తీ చేయనుంది.
పోలీసులు దొంగలను లేదా ఇతరులను కొట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో మద్యం మత్తులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ హోంగార్డును కొట్టిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో చేరి వారి చదువును పూర్తి చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జాతీయవైద్యమండలి ఉక్రెయిన్ అందించే అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ను గుర్తించడానికి అంగీకరించింది.
నిత్యం తుపాకుల శబ్దాలతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కాగా మంగళవారం నాడు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులతో జమ్మూ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉమేష్ బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలోని టాయిలెట్లో కుప్పకూలిపోయాడు.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించనున్నారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర దాదాపు 150 రోజుల్లో పూర్తి కానుంది.
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో నీటి భాగస్వామ్యం, రైల్వేలు, సైన్స్, వాణిజ్యం మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యల పై ఏడు అవగాహన ఒప్పందాల (ఎంఒయులు) పై సంతకం చేశాయి.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇవాళ రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత షేక్ హసీనా మాట్లాడారు. భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని, ఇండియాకు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని, విముక్తి పోరాట సమయంలో ఇండియా ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్నారు.