Last Updated:

Nadendla Manohar : మీ వ్యాఖ్యలు మీ అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయి.. సీఎం జగన్ పై నాదెండ్ల మనోహర్ ఫైర్

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్..జనసేనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

Nadendla Manohar : మీ వ్యాఖ్యలు మీ అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయి..  సీఎం జగన్ పై నాదెండ్ల మనోహర్  ఫైర్

Janasena: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్..జనసేనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎందుకు రౌడీ సేన? అని ప్రశ్నించారు.

మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? లేదా రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులుని, వీర మహిళలను, కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయని మనోహర్ అన్నారు.

సోమవారం నరసాపురంలో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని విమర్శించారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాలనను ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ప్రజలు బై బై చెప్పారని అన్నారు

ఇవి కూడా చదవండి: