Last Updated:

Niranjan Reddy: బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్.. స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan Reddy: ఇద్దరు కీలక పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి దీనిపై స్పందించారు. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని ఆయన అన్నారు.

Niranjan Reddy: బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్.. స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan Reddy: ఇద్దరు కీలక పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి దీనిపై స్పందించారు. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. ఇన్నేళ్లుగా పార్టీలో ఉన్నవారి ఆత్మాభిమానం ఎటుపోయిందని ప్రశ్నించారు.

నిరంజన్ రెడ్డి ఫైర్.. (Niranjan Reddy)

ఇద్దరు కీలక పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి దీనిపై స్పందించారు. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. ఇన్నేళ్లుగా పార్టీలో ఉన్నపుడు ఆత్మాభిమానం ఎటుపోయిందని ప్రశ్నించారు. ఈ మేరకు ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ కీలక నేతలు కావాలనే.. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కంటే వ్యక్తులే ముఖ్యమనే విధంగా వీరి ప్రవర్తన ఉందని మండిపడ్డారు.

పార్టీ పేరును చెడగొట్టడానికే.. వీరిద్దరు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే తమ ఇష్టారీతిన వ్యవహరించారని అన్నారు. వ్యక్తులకు పార్టీ తలొగ్గదని అన్నారు.

టీఆర్ఎస్ స్థాపించిన 11 ఏళ్ల తర్వాత జూపల్లి పార్టీలో చేరారని అన్నారు. అయనను దృష్టింలో ఉంచుకుని పార్టీలో సముచిత స్థానం ఇచ్చిందని తెలిపారు. మెుదటివారిని కాదని.. కేసీఆర్ జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై సీనియర్ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు.

పలు సందర్బాల్లో బహిరంగంగానే వీరుద్దరూ కేసీఆర్ పై విరుచుకుపడినా అధిష్టానం ఏ యాక్షన్ తీసుకోలేదు.

కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఆదివారంనాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఇందులో భాగంగా గులాబీ బాస్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు.

దీనిపై సీరియస్ అయిన కేసీఆర్ కాసేపటి క్రితం వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పొంగులేటి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మద్దతుదార్ల పేర్లను ప్రకటించారు.

ఖమ్మం జిల్లాలో పోటీ అంటూ ఉంటే అది బీఆర్‌ఎస్‌, పొంగులేటి వర్గానికి మాత్రమే ఉంటుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇక మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం అధిష్టానంపై వ్యతిరేకతతో పొంగులేటి వర్గంతో చేతులు కలపడం వల్ల కేసీఆర్ ఆయనపై కూడా చర్యలు తీసుకున్నారు.

వీరిద్దరితో పాటు మరికొందరు నేతలు కూడా పొంగులేటితో చేరే అవకాశాలు ఉన్నాయి మరి వారిపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.