Last Updated:

Janasena Yuvashakthi: తమ నీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.

Janasena Yuvashakthi: తమ నీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో “యువశక్తి” సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. ఈ సభ వేదికగా యువతకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

వైకాపా పతనాన్ని చూస్తాం..

మరోవైపు యువశక్తి సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే యువత కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారు. మరోవైపు పవన్ బహిరంగ సభ నేపథ్యంలో అధికార, జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. కాగా ఈ సభలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత నాగబాబు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

వైకాపా పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని నాగబాబు చెప్పారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పనిచేస్తానని చెప్పారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. కానీ సీఎం జగన్ తన నీడని చూసి తానే భయపడే రకం అని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ యాత్ర అని అడ్డుకోవడానికి, వారాహిని ఆపడానికే ప్రభుత్వం జీవో 1 ని తీసుకొచ్చింది అని నాగబాబు ఆరోపించారు. చరిత్రలో నియంతలా వ్యవహరించిన వారంతా చివరికి ప్రజలచేతిలో పతనం అయ్యారని గూర్చు చేశారు నాగబాబు. సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసీపీ పతనం ఖాయం అని నాగబాబు వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

ఇవీ చదవండి:

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: