CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవో వెంకటేశ్వరరావుతో భేటీ అయిన రామచంద్ర యాదవ్

ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నా రామచంద్ర యాదవ్ శనివారం ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై వీరు  చర్చించారు. 

  • Written By:
  • Updated On - July 2, 2023 / 07:24 AM IST

CEO Prime9 News P. venkateswararao: ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ శనివారం ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై వీరు  చర్చించారు.

రామచంద్రయాదవ్ గత నెలలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జూలై 23న కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి, హత్య, ఫ్యాక్షన్, వెన్నపోటు రాజకీయాలను పారదోలి నూతన రాజకీయ వ్యవస్థ కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ప్రజా చైతన్య వేదికపై లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు. రాజకీయ గ్రహణాలు వదిలించడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలో భారీ సభ జరిపి నూతన పార్టీ పేరు, జెండా ప్రకటిస్తామన్నారు.