Deputy Chief Minister Bhatti Vikramarka: నాలుగు నెలల్లో నైనీ కోల్ బ్లాకులో ఉత్పత్తి ప్రారంభించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్‌లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

  • Written By:
  • Publish Date - July 17, 2024 / 07:59 PM IST

Deputy Chief Minister Bhatti Vikramarka: సింగరేణి కేలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్‌లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వచ్చే నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆయన ఇంధన శాఖ సెక్రటరీ రోనాల్డ్ రాస్, ఎస్‌సిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ మరియు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఒడిశా అటవీశాఖతో సంప్రదింపులు చేయాలి..(Deputy Chief Minister Bhatti Vikramarka)

ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణా వెలుపల సింగరేణి చేపడుతున్న మొట్టమొదటి ప్రాజెక్టు ఇదని చెప్పారు. అందువలన మైనింగ్ కార్యకలాపాలు రాష్ట్ర ప్రభుత్వం మరియు సంస్థ యొక్క ఖ్యాతిని పెంచేలా చూడాలని అధికారులను కోరారు. స్థానికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నైని కోల్ బ్లాక్ కోసం అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే 783.27 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదిలీ చేసింది. చెట్ల లెక్కింపు, తొలగింపు, తదుపరి భూమి అప్పగింతలో పురోగతిపై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు ఒడిశా అటవీ శాఖతో నిరంతరం సంప్రదింపులు చేయాలని భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలు,ఉపాధి అవకాశాలతో సహా సమగ్ర పునరావాసం మరియు పునరావాస (ఆర్అండ్ఆర్ ) ప్యాకేజీని నిర్వాసితులైన గ్రామస్థులకు అందించాలని కూడా ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనుల నిర్వహణకు సంబంధించి నిర్దేశించిన కాలపరిమితిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.