Flipkart Diwali Sale: ఆఫర్లు వచ్చాయ్.. ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సేల్.. ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్!

Flipkart Diwali Sale: సెప్టెంబర్ నెల నుంచి ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు భారీ సేల్స్‌ను ప్రకటిస్తూ వస్తున్నాయి. చాలా ఉత్పత్తులను చాలా చౌక ధరకే అందించాయి. సేల్ సందర్బంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముగిసింది. ఆ తర్వాత వెంటనే బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రవేశపెట్టంది.

ఈ సేల్ అక్టోబర్ 17న ముగిసింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌తో తిరిగి వచ్చింది. దీపావళి పండుగ నేపథ్యంలో  కంపెనీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లపై మరోసారి గొప్ప ఆఫర్లు కనిపించబోతున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్ వెబ్‌‌సైట్ ప్రకారం.. ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్లస్ మెంబర్లు అక్టోబర్ 20 నుండి ఈ సేల్‌ను యాక్సెస్ చేయచ్చు. సేల్ స్టార్ట్ అయే ముందు బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌లను చూడబోతున్న ఉత్పత్తులను కంపెనీ టీజ్ చేసింది. ఇందులో ఐఫోన్, అనేక ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు సేల్ పేజీలో కనిపి్తి. ఇి కాకుండా కంపెనీ ఇతర కాటగిరీ ఉత్పత్తులను కూడా టీజ్ చేసింది. ఇవి చాలా తక్కువ ధరలకు సేల్‌లో లభిస్తాయి.

  1. iPhone 15
  2. iPhone 15 Plus
  3. Motorola G85 5G
  4. SAMSUNG Galaxy S23 FE
  5. vivo V40 5G

కంపెనీ తన వెబ్‌సైట్‌లోని టాప్ డీల్స్ పేజీలో జాబితా చేసిన స్మార్ట్‌ఫోన్‌లు ఇవి. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ వాటి ధర పరిధిలో అత్యంత శక్తివంతమైన ఫోన్లు. సేల్‌లో ఈ ఫోన్‌లపై అత్యధిక తగ్గింపును చూడబోతున్నారు. అయితే ఇది కాకుండా చాలా స్మార్ట్‌ఫోన్‌లు కూడా చాలా చౌక ధరలలో సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.

బిగ్ బిలియన్ డేస్ సేల్ లాగానే దీపావళి సేల్‌లో కూడా మీరు ఐఫోన్ 15ని కేవలం రూ. 50 నుండి 55 వేలకు ఆఫర్‌లతో కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. అదే సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE కూడా రూ. 30 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా సేల్ సమయంలో కంపెనీ అనేక ఇతర గాడ్జెట్‌లపై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తుంది.