Home / Telangana
CM Revanth Reddy : ఉమ్మడి వరంగల్ తనకు ఎంతో అభిమానమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచే ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. వరంగల్కు విమానాశ్రయం తీసుకొస్తానని లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సాధించామని చెప్పారు. స్టేషన్ ఘన్పూర్లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కేసీఆర్ రూ.8.29లక్షల అప్పును […]
Osmania University : ఉద్యమాలకు ఊపిరి పోసిన ఓయూలో ఇక నుంచి ధర్నాలు, నిరసనలు నిషేధించారు. తాజాగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. ఓయూ శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు. కానీ, విద్యార్థులు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన, ప్రదర్శనలు, ధర్నాలు చేయడం వల్ల పరిపాలన పనులకు ఆటంకం కలుగుతోందని సర్క్యులర్ ఇచ్చారు. యూనివర్సిటీ నిబంధనలు అతిక్రమించడం, ధర్నాలు, ఆందోళనలు, నినాదాలు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించకుండా నిరోధించడం […]
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బయట బూతులు మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నామని, కానీ బూతులతోపాటు అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ బూతు పిత అయ్యారని విమర్శించారు. బూతు సినిమాకు పనికొచ్చే స్క్రిప్ట్ లాగా ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉందని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ […]
CM Revanth Reddy : స్టేచర్పై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మండలిలో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57 లక్షల జీతం తీసుకుంటున్నారని, అసెంబ్లీకి రావటం లేదన్నారు. ప్రభుత్వానికి సూచనలు […]
Kishan Reddy : డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు. శనివారం రైల్వే ఎంజీ అరుణ్ కుమార్ జైన్తో కలిసి ఆయన బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. మహిళ ఉద్యోగులు ఉండేలా చొరవ తీసుకుంటాం.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల […]
Harish Rao : ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ కోరుకున్నారని, అందుకే ఇవాళ శాసనసభలో ముఖ్యమంత్రి స్పీచ్ను బహిష్కరించామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించి మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ […]
TG Assembly : సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్కు ముందు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్టేచర్పై నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాధక్షుడు అయిన కేసీఆర్ చావును […]
Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని, మీకు మీరుగా స్టేచర్ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడారు. గవర్నర్ను గౌరవించడం లేదని, స్పీకర్ను బీఆర్ఎస్ సభ్యులు గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. కులానికి స్టేచర్ ఉండదని, ఒక్క పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, […]
Group-3 Results : తెలంగాణ రాష్ట్ర గ్రూప్-3 ఫలితాలను ఇవాళ టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ర్యాంకులను సైతం విడుదల చేసింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఫలితాలను చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూప్-3లో పురుషుల్లో టాప్ ర్యాంకర్కు 339.24 మార్కులు వచ్చాయని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-3 మహిళా టాప్ ర్యాంకర్కు 325.15 మార్కులు వచ్చినట్లు తెలిపింది. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్లు చెప్పింది. మొదటి 50 […]
MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ […]