Home / Telangana
Kamareddy : పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పెద్ద చెరువులో పడి మృతిచెందారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్గా గుర్తించారు. ఇవాళ ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా, చిన్నారులు ముగ్గురు స్నానానికి చెరువులోకి దిగారు. చెరువులో […]
Ugadi Celebrations : కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల స్టేట్ కార్యాలయాల్లో ఇవాళ ఉగాది పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణంలో ఆసక్తికర విషయాలు వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో చీఫ్ కిషన్ […]
PMJ: ఈరోజు మా మెరిసే ప్రయాణంలో మరో మైలురాయి, వేడుకలో మాతో చేరడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. 60 సంవత్సరాల క్రితం ప్రతి సందర్భానికి శాశ్వతమైన ప్రకాశాన్ని జోడించే కలకాలం నిలిచే ఆభరణాలతో మీ వేడుకలను అలంకరించాలనే ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం. గత 6 దశాబ్దాలుగా మీ అత్యంత విశ్వసనీయ ఆభరణాల వ్యాపారిగా, మీరు గర్వంగా ధరించే ప్రతి PMJ ఆభరణంలో మేము ప్రామాణికత, వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాము. మీరు ఆభరణాలకు ఇస్తున్న ప్రాధాన్యతరను అర్థం […]
Revanth Reddy : ప్రజాసంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని చెప్పారు. ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని చెప్పారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచన అన్నారు. బడ్జెట్లో […]
Telangana Government Revenue Department Jobs: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామ పాలన ఆఫీసర్(జీపీఓ) పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోస్టులకు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని సూచించింది. అయితే డిగ్రీ అర్హత లేని సమక్షంలో ఇంటర్ పూర్తి చేసి వీఆర్ఓ లేదా వీఆర్ఏగా కనీసం […]
Hyderabad Metro Timings Change: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో సమయం పొడిగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉండే మెట్రో సేవల సమయం పెరిగింది. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడవనుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. టెర్మినల్ స్టేషన్ల […]
Telangana BC Vidya Nidhi Scheme From April 1: తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్య చదివేందుకు బీసీ విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కాగా, అభ్యర్థులు డిగ్రీలో 60శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై […]
Minister Ponguleti Key Comments About Double BedRoom Houses: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి స్థలం లేని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే, అసంపూర్తిగా […]
Paper leakage : నకిరేకల్ పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విద్యార్థిని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి, నల్లగొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా విద్యార్థిని పేర్కొంది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని […]
KTR : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు వాడివేడీగా కొనసాగాయి. అవయవదానం బిల్లును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అవయవదానం బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా జీవన్దాన్ ద్వారా 3,724 మంది బాధితులు ఆర్గాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. […]