Home / International News
ఈ వారం ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసంపై ఎఫ్బీఐ ఏజెంట్లు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సెట్ల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లతో పాటు
అమెరికాలోని న్యూయార్క్లో శుక్రవారం జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో రచయిత సల్మాన్ రష్దీ మెడ, పొత్తికడుపుపై ఒక వ్యక్తి కత్తితో దాడిచేసారు. 75 ఏళ్ల రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు .అతను ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతనిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
తాలిబన్ మత గురువు రహీముల్లా హక్కానీ ఐసీస్ ఆత్మాహుతి దాడిలో మృతి చెందారు. ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మదర్సాలో ఆయనను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఇటీవల కాలంలో ఆయన బాలికలు స్కూళ్లకు వెళ్లి విద్యనభ్యసించవచ్చునని పలుమార్ల బహిరంగ మద్దతు ప్రకటించారు.
ఈ ఏడాది బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు విపరీతమైన ఎండలు కాస్తాయని తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంగ్లండ్లో పాటు వెల్స్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్ ప్రపంచం అల్లాడినా, ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటీవల అక్కడ కూడా వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే లక్షల మంది ప్రజలు జ్వరం బారినపడ్డారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాత్కాలికంగా నివసించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్న రాజపక్స వీసా నేటితో ముగిసిపోతుంది. కాబట్టి సింగపూర్ నుంచి వేరే ఇతర దేశానికి మకాం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది.
అప్గానిస్తాన్లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు
శ్రీలంక ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. పెట్రోల్ కొరత, ఆహార కొరత, విద్యుత్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తాజాగా శ్రీలంక ప్రజల నెత్తిన కరెంటు చార్జీలు పిడుగు పడింది. సిలోన్ ఎలక్ర్టిసిటి బోర్డు విద్యుత్ టారిఫ్ను ఏకంగా 264 శాతం పెంచేసింది.
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు ఏకంగా 50 శాతం పెంచేసింది ప్రభుత్వం.దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడంతో భారత్ తో పాటు శ్రీలంకలో కూడా ఇటీవల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చూశాం.