Last Updated:

IPL 2025: తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ బోణీ.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ

IPL 2025: తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ బోణీ.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ

RCB WON THE MATCH IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ ‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైటరైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్‌కతా నైటరైడర్స్ బ్యాటర్లలో రహానె(56), సునీల్ నరైన్(44), రఘువంశీ(30) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లు పడగొట్టగా.. హేజిల్ వుడ్ రెండు వికెట్లు, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, దయాల్ తలో వికెట్ తీశారు.

 

175 పరుగుల లక్ష్యఛేదనను బెంగళూరు కేవలం 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు సాల్ట్(56), విరాట్ కోహ్లీ(59) హాఫ్ సెంచరీలు చేయగా.. రజత్ పటీదార్(34) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన తలో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: