Home / పొలిటికల్ వార్తలు
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్ గత ఆగస్ట్ లో నియామకమైనారు. ఈ నేపధ్యంలో ఆయన అక్టోబర్ 1న హైదరాబాదుకు రానున్నారు.
ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశం మాటలపై తెలంగాణ మంత్రి హరీష్ రావుకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు మా ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చని విస్మయానికి గురిచేశారు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్లో తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు.
భారత్ జోడో యాత్రను తలపెట్టిన కాంగ్రెస్ ను అడ్డుకొనేందుకు అధికార భాజాపా శ్రేణులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ 1న రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో ప్రవేశించనున్న నేపథ్యంలో స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను భాజాపానే చింపేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
ఏపీలో భాజపాకు తోడుగా ఉండేది జనసేనేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జాప్యానికి అధికార వైకాపా, గత టీడీపీ ప్రభుత్వాలే కారణమంటూ కొత్తగా ఆరోపించారు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను బలిసిన పాదయాత్రగా అభివర్ణించిన వైకాపా నేతలకు పాదయాత్రలోని మహిళలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అవకాశం మేరకు సాయం చేయండి, లేదా మూసుకొని కూర్చోండి అంటూ హితవు పలికారు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ నెల 10న కేరళలో ప్రవేశించిన రాహుల్ పాద యాత్ర నేడు వాయనాడ్ నియోజకవర్గంలో ప్రవేశించింది. కేరళలో రాహుల్ పాదయాత్ర 450 కి.మీమేర సాగనుంది
రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో విలువైన ఇనుప ఖణిజాలను పరులు పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని, ఏపి ఎండీసి ద్వార ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2 ప్లాన్ కు వైకాపా ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు