Sambit Patra: మండుతున్న నిప్పులపై నడిచిన బీజేపీ నేత సంబిత్ పాత్ర
:ఒడిశాలోని పూరీ జిల్లాలో జరుగుతున్న ఝాము జాతరలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నిప్పులపై నడిచారు.మంగళవారం మండుతున్న నిప్పులపై అతను 10 మీటర్లు నడిచారు

Sambit Patra:ఒడిశాలోని పూరీ జిల్లాలో జరుగుతున్న ఝాము జాతరలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నిప్పులపై నడిచారు.మంగళవారం మండుతున్న నిప్పులపై అతను 10 మీటర్లు నడిచారు.ఈ రోజు, నేను పూరీ జిల్లాలోని సమంగ్ పంచాయతీకి చెందిన రెబాటి రామన్ గ్రామ యాత్రలో పాల్గొని, మా అమ్మను నిప్పు మీద నడిచి పూజించి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.ఈ తీర్థయాత్రలో, నేను నిప్పు మీద నడవడం ద్వారా మరియు తల్లి (దులన్ దేవత) ఆశీర్వాదం పొందడం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను అని పాత్రా ట్వీట్ చేసారు.
ప్రజల సంక్షేమం కోసం నడిచాను.. (Sambit Patra)
ఈ సందర్బంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ప్రజల సంక్షేమం మరియు శాంతిభద్రతల కోసం నిప్పు మీద నడిచానని అన్నారు.పాత్రా 2019 లోక్సభ ఎన్నికల్లో పూరీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేడీకి చెందిన పినాకి మిశ్రా చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.సాంప్రదాయం ప్రకారం, ఝాము జాతరలో భక్తులు కోరికలు నెరవేర్చుకోవడానికి , మాతృ దేవత దులన్ను శాంతింపజేయడానికి నిప్పు మీద నడవడం చేస్తుంటారు.
शक्ति पूजा हमारी सनातन संस्कृति एवं परंपरा का अहम हिस्सा है, पुरी जिले के समंग पंचायत के रेबती रमण गांव में आयोजित यह दण्ड और झामू यात्रा इसी प्राचीन परंपरा का प्रतीक है।
इस तीर्थयात्रा में अग्नि पर चलकर मां की पूजा-अर्चना एवं आशीर्वाद प्राप्त कर, खुद को धन्य अनुभव कर रहा हूँ।… pic.twitter.com/oTciqW61Gj
— Sambit Patra (@sambitswaraj) April 11, 2023
ఇవి కూడా చదవండి:
- Raghava Lawrence : మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. 150 మంది పిల్లల్ని దత్తత
- Tirumala: తిరుమలలో హనుమత్ జయంతి ఉత్పవాలు.. ఘనంగా ఏర్పాట్లు