Home /Author anantharao b
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని ఆదివారం 10% పెంచింది, దీనితో రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు మరియు 88 పైసలు పెరిగాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్ను పొడిగించింది.
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో కనీసం 25 మంది మరణించగా 145 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బన్నూ, లక్కీ మార్వాట్ మరియు కరక్ జిల్లాల్లో వర్షాలు కారణంగా చెట్లుు, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటర్స్ టవర్స్ నేలకూలాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పుపై జరుగుతున్న చర్చ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తమ పార్టీలో లీకులకు తావుండదని బండి సంజయ్ అన్నారు.
: పూజారి ప్రియుడి చేతిలో శంషాబాద్లో హత్యకు గురైన అప్సర కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకి మూడేళ్ళ కిందట చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్ళైందని పోలీసుల విచారణలో తేలింది. కానీ భర్తతో విబేధాల కారణంగా ఏడాది కిందట సరూర్నగర్లోని పుట్టింటికి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రికి బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు.
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు
ఉక్రెయిన్ లోని కఖోవ్కా ఆనకట్ట ధ్వంసంతో దక్షిణ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వరదల కారణంగా కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, రష్యా తన దళాల ఆధీనంలో ఉన్న భూభాగాల్లో కనీసం ఎనిమిది మంది మరణించినట్లు తెలిపింది.