భారత కొత్త జెర్సీ విశేషాలివే
భారత కొత్త జెర్సీ విశేషాలివే Team India New jersey

వన్డే క్రికెట్లో టీమిండియా ఆటగాళ్లు ధరించనున్న జెర్సీలాగానే టీ20 క్రికెట్ జెర్సీ కూడా ఉంది.

ఈ మేరకు అడిడాస్ స్పాన్సర్ చేసిన కొత్త జెర్సీలో భారత ఆటగాళ్లు ఫోటోషూట్ చేశారు.

అయితే ముందటి జెర్సీకి కాలర్ ఉంది కానీ టీ20 క్రికెట్లో టీమిండియా ధరించనున్న జెర్సీకి కాలర్ లేదు.

ముదురు నీలం రంగులో ఈ జెర్సీని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ ఫోటో షూట్లో మెన్స్ టీమ్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ పాల్గొన్నారు.

మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా కొత్త జెర్సీలో మెరిశారు.

టీమిండియా వన్డే క్రికెట్ కొత్త జెర్సీకి సరిగ్గా ఛాతిపై నీలి రంగులో భారత్ అని రాసి ఉంటుంది.

ఆ అక్షరాలకు పైన ఒక వైపు అడిడాస్ కంపెనీ లోగో, మరోవపైపు బీసీసీఐ లోగో ఉంటుంది. ఇంకా జెర్సీ భుజాలపై కూడా అడిడాస్ని సూచించేలా స్ట్రిప్స్ ఉన్నాయి.

జూన్ 1 నుంచి టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్ కంపెనీ కొత్త అడుగు వేసింది. ఇందులో భాగంగా మూడు ఫార్మాట్ల క్రికెట్కు సంబంధించి విభిన్నమైన కొత్త జెర్సీలను రూపొందించారు.
