GT vs MI: గుజరాత్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 208 పరుగులు
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ అర్దసెంచరీతో రాణించాడు. చివర్లో అభినవ్ మనోహోర్, మిల్లర్ దాటిగా ఆడి స్కోర్ ను పరుగులు పెట్టించారు. చివర్లో తేవాటియా సిక్సులతో విరుచుకుపడ్డాడు.
ముంబయి బౌలింగ్ లో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, మెరిడిత్, టెండూల్కర్, బెహరెండఫ్ తలో వికెట్ పడగొట్టారు.