Home / latest international news
చైనాలో యాంటీవైరల్ ఫ్లూ ఔషధాల ఆన్లైన్ అమ్మకాలు ఏడాది క్రితం కంటే 100 రెట్లు పెరిగాయి. చైనా ఆధారిత ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు టావోబావోలో మార్చి మొదటి 13 రోజుల్లో ఒసెల్టామివిర్ అనే జెనెరిక్ పేరుతో విక్రయించబడుతున్న ఈ ఔషధం అమ్మకాల పరిమాణం దాదాపు 533,100 యూనిట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది.
:ఫ్రెడ్డీ తుఫాను కారణంగా మొజాంబిక్ మరియు మలావిలో సంభవించిన వరదలకు 300 మంది మరణించగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. తుఫాను కారణంగా దేశంలోని ఆర్థిక కేంద్రమైన బ్లాంటైర్తో సహా మలావి యొక్క దక్షిణ ప్రాంతంలో కనీసం 300 మంది మరణించగా మరో 88,000 మంది నిరాశ్రయులయ్యారు.
గత ఏడాది అత్యధిక ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) నివేదిక 2022 ప్రకారం, కాబూల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది వరుసగా నాలుగో సంవత్సరం. దాడులు మరియు మరణాలు వరుసగా 75 శాతం మరియు 58 శాతం తగ్గినప్పటికీ ర్యాంక్ వచ్చింది.
తాజాగా బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం క్షీణించింది.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్ కు వివాహానికి పూర్వమే సంతానోత్పత్తి పరీక్షలు నిర్వహించారా? అంటే అవుననే అంటున్నారు రచయిత టామ్ క్విన్ . ఈ జంట వివాహం గురించి ఆయన రాసిన Gilded Youth: An Intimate History of Growing Up in the Royal Family అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈసారి తన కుక్క కారణంగా పోలీసులతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. కారు సీటు బెల్ట్ ధరించనందుకు మరియు మహమ్మారి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సునక్ గతంలో రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
రష్యా యుద్ధ విమానం తన స్పై డ్రోన్లలో ఒకదాని ప్రొపెల్లర్ను క్లిప్ చేసి మంగళవారం నల్ల సముద్రంలో కూలిపోయిందని యుఎస్ మిలిటరీ తెలిపింది.రెండు రష్యన్ Su-27 జెట్లు అంతర్జాతీయ గగనతలంలో ఎగురుతున్నప్పుడు యూఎస్ మిలిటరీ డ్రోన్ను అడ్డగించాయి.
పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం అధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు క్యాబినెట్ సభ్యులతో సహా ఎన్నికైన అధికారులకు 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన తోషాఖానా బహుమతులను తీసుకోవడాన్ని నిషేధించింది. ఇది న్యాయమూర్తులు, సివిల్ మరియు మిలటరీ అధికారులకు కూడా వర్తిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలకు వీరిని కూర్చోబెట్టి పెన్షన్లు ఇవ్వడం తలకు మించిన భారంగా భావిస్తోంది. ఫ్రాన్స్లో మెక్రాన్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 నుంచి 64కు పెంచింది.
మూడు సంవత్సరాల తరువాత విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. మార్చి 15 నుండి వివిధ రకాల వీసాల జారీని పునఃప్రారంభిస్తామని తెలిపింది. కోవిడ్ నేపధ్యంలో గత మూడేళ్లుగా విదేశీ పర్యాటకులను చైనా అనుమతించలేదు.