Home / cricket news
టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.
టీ20ల సిరీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో ఆసీస్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తరువాత టీమ్ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-1 తేడాతో టీమ్ఇండియా కైవసం చేసుకుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ తుది దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి విజయం సాధించి స్కోర్ సమం చేసుకోగా.. ఇక సిరీస్ నిర్ణయాత్మక పోరుకు నేడు ఉప్పల్ స్టేడియం వేదికకానుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. నాగపూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ని 1-1గాసమం చేసింది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి టీం ఇండియా పగతీర్చుకుంది.
ప్రపంచ క్రికెట్లో పాక్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్లను ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ లో పాక్ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం డీలాపడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ఓటమికి రెండో మ్యాచ్ తో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా బాబర్-రిజ్వాన్ ల జోడీ తిరగరాసింది.
ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మహిళలు సత్తాచాటారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్ గడ్డపై వన్డే సిరీస్ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. హర్మన్ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్ల తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్కి వేదికగా నిలవడం వల్ల టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్లను గురువారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు జరుపుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పేర్కొనడంతో.. సికింద్రాబాద్లోని జిమ్ఖానా మైదానానికి బుధవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారీ స్కోర్ చేసినా భారత్ కు ఫలితం దక్కలేదు. కొండంత లక్ష్యం కూడా ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు కరిగిపోయింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.