Home / ap news
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అడుగుకు రూ. 100 ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖదేవాలయాల్లో ఆన్లైన్ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలు విస్తరిస్తామని ఆయన తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
కృష్ణా జిల్లాలో ఘోరం చోటుచేసుకొనింది. వారి జీవనవృత్తే వారిని యమపాశంలా కబళించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి బస్సు యాత్రకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా బస్సు తయారు చేస్తున్నారు. హైదరాబాద్లో తయారవుతున్న ఈ బస్సుకు రెగ్యులర్ బస్లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఉపయోగించారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు