Home / ap news
కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని లేఖలో వివరించారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుట
ఆంధ్రప్రదేశ్ లో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అందుబాటులోకి తెస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్గ్రేడ్
సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈ రోజు సాయంత్రం జగన్ హస్తినకు బయల్దేరనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి ఆముదాలవలసకు చేరుకుంటారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరు అవుతారు. అనంతరం సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్
రాయలసీమ జిల్లాలను వానలు వదలడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జోరు వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా అదే కంపెనీలోని బి.షిఫ్టులో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు
బార్ పాలసీలో భాగంగా ఏపీలో బార్ లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రారంభం అయ్యింది. జోన్ల వారీగా బార్ లైసెన్సులకు బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయం 10గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం.
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో.. నిన్న అర్ధరాత్రి కొంతమంది దుండగులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మట్టి పూయడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అల్లూరి విగ్రహాన్ని పాలతో విగ్రహాన్ని శుభ్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేయనున్నారు. వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక కాగా, వారందరికీ ఇవాళ నిధులు మంజూరు కానున్నాయి.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త పాడె మోసారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందని వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరిగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.