Home / క్రీడలు
బ్రిటన్లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్కు దూసుకెళ్లింది. బ్యాటింగ్లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.
భారత క్రికెట్కు, సునీల్ గవాస్కర్కు గర్వకారణమైన విషయం. ఇంగ్లండ్లోని లీసెస్టర్ క్రికెట్ అథారిటీ తమ మైదానానికి గవాస్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది.ఇది 5 ఎకరాల మైదానం. ఇప్పటికే గవాస్కర్ చిత్రాన్ని స్టేడియం వెలుపల ఉన్న గోడలలో ఒకదానిపై చిత్రీకరించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ ట్రోఫీతో నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ తన రిటైర్మెంట్ను స్టోక్స్ ప్రకటించాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని డుర్హమ్లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడతానని తెలిపాడు.
భారత జట్టు మరోసారి సత్తాచాటింది. ఇంగ్లాండ్ సొంతగడ్డపై రోహిత్ సేన ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్ను సైతం కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన సిరీస్ కైవసం
లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు చేదించలేకపోయింది.247 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా ఔట్ అయ్యారు
లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించిన భారత్... ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.