MI Vs RCB: బెంగళూరు భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 200 పరుగులు
MI Vs RCB: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు కూడా 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.
MI Vs RCB: బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు.. మెుదట్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్ వెల్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. చివర్లో దినేష్ కార్తీక్ రాణించాడు.
ముంబయి బౌలింగ్ లో.. బెహర్డింఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, గ్రీన్, జోర్డాన్ చెరో వికెట్ తీసుకున్నారు.