Last Updated:

Bridges Collapse in Bihar: బీహార్‌లో కూలిపోయిన మరో రెండు బ్రిడ్జిలు..

బీహార్‌లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.

Bridges Collapse in Bihar: బీహార్‌లో కూలిపోయిన మరో రెండు బ్రిడ్జిలు..

Bridges Collapse in Bihar: బీహార్‌లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.

35 ఏళ్ల నాటివి..(Bridges Collapse in Bihar)

దాదాపు 35 సంవత్సరాల నాటి ఈ రెండు బ్రిడ్జిలు సివాన్ జిల్లాలోని డియోరియా బ్లాక్‌లో ఉన్నాయి. ఇవి పలు గ్రామాలను మహరాజ్‌గంజ్‌తో కలుపుతాయి. ప్రస్తుతం ఇవి కుప్పకూలడంతో ట్రాఫిక్‌కు, మనుషుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూలిన రెండు వంతెనల్లో ఒకటి 1998లో అప్పటి ఎంపీ ప్రభునాథ్‌సింగ్‌ నిధులతో రూ.6 లక్షలతో, మరొకటి రూ.10 లక్షలతో 2004లో మరో వంతెనను నిర్మించారు. అప్పటి నుంచి రెండు వంతెనలకు మరమ్మతులు చేయలేదు.

వరుసగా కూలుతున్న వంతెనలు..

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గండకి నది ఉప్పెనతో వంతెన నిర్మాణం బలహీనపడే అవకాశం ఉందని గ్రామస్తులు సూచించారు.ఈ సంఘటన కేవలం 11 రోజుల క్రితం సివాన్‌లో మరో వంతెన కూలిన తరువాత జరిగింది. వరుసగా వంతెనలు కూలిపోవడం బీహార్‌లో మౌలిక సదుపాయాల స్థితిపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. జూన్ 22న, దరౌండా ప్రాంతంలో వంతెన యొక్క ఒక భాగం కూలిపోయింది.ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్ మరియు కిషన్‌గంజ్ వంటి జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు నివేదించబడ్డాయి, ఈ సంఘటనలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి: