Home / జాతీయం
గ్యాంగ్స్టర్ అబు సలేంను ముంబై బాంబు పేలుళ్ల కేసులో విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి అబ సలేం 25 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేశారు. మంబై బాంబు పేలుళ్లకు సంబంధించి నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కేంద్రప్రభుత్వం పోర్చుగల్ ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చిందని అబు సలేం గుర్తు చేశారు.
గోవా కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిపోయింది. 40 మంది గోవా శాసనసభ్యుల్లో కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు 11 మంది. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మిగలగా, ఆరు మంది బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతుండం పట్ల కాంగ్రెస్ అధిష్టానం
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాగాంధీకి తాజాగా సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న హాజరు కావాలని నోటీసులో కోరింది. కాగా ఈడీ సోనియాకు గాంధీకి ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఇదిలా ఉండగా గత నెలలో ఈడీ జారీ చేసిన సమన్లను కొంత కాలం పాటు వాయిదా వేయాలని సోనియా కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కాగా కొత్త పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని ఆవిష్కరించారు. నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
ఆరోగ్య ప్రయోజనాల కోసం "సూపర్ ఫ్రూట్"గా పిలిచే డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశంలో దీని సాగును విస్తరించవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో డ్రాగన్ ఫ్రూట్ 3,000 హెక్టార్లలో సాగు చేయబడుతోంది.
తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రెండు గ్రూపుల మధ్య పోరు తారస్దాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ద్వంద్వ-నాయకత్వ నమూనాకు స్వస్తి పలికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు నేడు జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పళనిస్వామిని ఎన్నుకుంది.
అన్నాడీఎంకే లో మరోసారి రచ్చ మొదలైంది. పార్టీ కార్యాలయాల వద్దే ఇరు వర్గాల కార్యకర్తుల బాహాబాహీకి దిగారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అన్నాడీఎంకే పై పట్టు కోసం అటు పన్నీర్ సెల్వం, ఇటు ఎడప్పాడి పళనిస్వామి రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీ ఒకరి చేతిలోనే ఉండాలని పళని స్వామి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
దేశం వేగంగా అభివృద్ది చెందడానికి 'సబ్కా ప్రయాస్' పునాది అని ప్రధాని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూరత్ లో జరుగుతున్న నేచురల్ ఫార్మింగ్ కాన్క్లేవ్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, దేశం వివిధ లక్ష్యాల కోసం పని చేయడం ప్రారంభించిందన్నారు.
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. కొలంబో అన్నారు.శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే 44,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేయడానికి వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిశారు.
ఐదు వంటనూనెల రిటైల్ ధరలు మస్టర్డ్ ఆయిల్, వనస్పతి, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ గత నెలతో పోలిస్తే 2–8% తగ్గాయి, అయితే ఇప్పటికీ గత ఏడాదికంటే 3–21% ఎక్కువగా ఉన్నాయి.