Published On:

TGSRTC Profits in Puskaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు.. ఆర్టీసీకి కాసుల వర్షం

TGSRTC Profits in Puskaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు.. ఆర్టీసీకి కాసుల వర్షం

TGSRTC got Rs 8 Crore Profits in Saraswati Puskaralu: గత 12 రోజులుగా భూపాలపల్లి జిల్లా కాళ్వేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నిన్నటితో ముగిశాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళ్వేశ్వరానికి తరలివచ్చారు. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళ్వేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శించుకుని పరవశించారు. పుష్కరాలకు నిన్నటితో ఆఖరిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా గత 12 రోజుల్లో 30 లక్షలకు పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు.

 

మరోవైపు సరస్వతి పుష్కరాలతో ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. పుష్కరాల కోసం ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించింది. దీంతో గత 12 రోజుల్లో ఆర్టీసీకి రూ. 8 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది డిపోలతో పాటు.. కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. మొత్తంగా 12 రోజుల్లో ఆర్టీసీ 8419 ట్రిప్పులు నడపగా.. 4 లక్షల 63 వేల 691 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అధికారులు చెప్పారు. మొదట్లో ఆర్టీసీలో తక్కువ మంది ప్రయాణించినా.. పుష్కరాల ముగింపు సమయం దగ్గర పడే కొద్ది భారీగా ప్రయాణికులు తరలివచ్చారు.