Home / devotees
Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనా, పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోయినా ఇంకా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నిన్న, ఇవాళ వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల నారాయణగిరి వనం, సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు 24 గంటల […]
Free Prasadam in Yadagirigutta Temple: భక్తుల సౌకర్యార్థం యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పులిహోర, లడ్డూ పంపిణీ చేయాలని దేవస్థానం భావిస్తోంది. రేపటి నుంచి ఈనెల 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించనుంది. అంతా సవ్యంగా జరిగితే.. జూలై 1 నుంచి వారంలో ఆరు రోజులు పులిహోర, శనివారం నాడు పులిహోరతో పాటు లడ్డూ ప్రసాదాన్ని సైతం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఈవో వెంకట్ […]
Jyestabhishekam: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉన్న బంగారు కవచాలను తొలగించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. నైవేద్య తాంబూలాలు సమర్పింస్తారు. అలాగే ఉత్సవాల్లో మొదటిరోజు వజ్ర కవచం […]
Devotees: కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతిరోజు ఉత్సవమే. నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతుంటాయి. కాగా నేటి నుంచి శ్రీవారికి సాలకట్ల జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నారు. నేటి నుంచి జూన్ 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేలా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ వేడుకను అభిద్యేయక అభిషేకం అంటారు. అభిషేకాలతో ప్రాచీన […]
Devotees: వేసవి సెలవులు ముగియనుండటం, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుగుతుండటంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది. ఇవాళ ఉదయం సమయానికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం వరకు పడుతోంది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు […]
TTD Decided To Issue Divya Darshanam tokens At Alipiri: తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడకన తిరుమల కొండకు వెళ్లే భక్తులకు అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. 4 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను అందిస్తారు. అయితే గత […]
Piligrims: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఓ వైపు వేసవి ముగిసే సమయం దగ్గర పడుతుండడం, రైతులు, ప్రజలు వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నందున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా నెలరోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి […]
TGSRTC got Rs 8 Crore Profits in Saraswati Puskaralu: గత 12 రోజులుగా భూపాలపల్లి జిల్లా కాళ్వేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నిన్నటితో ముగిశాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళ్వేశ్వరానికి తరలివచ్చారు. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళ్వేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శించుకుని పరవశించారు. పుష్కరాలకు నిన్నటితో ఆఖరిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా గత 12 రోజుల్లో 30 లక్షలకు పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు […]
Heavy Rush in Saraswati Puskaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. గత 12 రోజులుగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగమ్మకు దీపాలు వదులుతున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. మరోవైపు సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాత్రి 7.45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు సమాప్తం కానున్నాయి. […]
Leopard in Tirumala Ghat Road: కలియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా కొందరు భక్తులు బస్సులు, ట్యాక్సీలు, కార్లలో కొండపైకి వెళ్తుండగా, మరికొందరు కాలిబాటన ఆలయానికి వెళ్తుంటారు. అయితే తిరుమలలో ఇవాళ చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద రోడ్డు దాటుతూ చిరుత కనిపించిందని.. […]