Home / తెలంగాణ
హైదరాబాద్ శివార్లలోని చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. మామూలుగా అయితే ఈ దర్శనానికి అంత ప్రాముఖ్యత ఉండదు .. కానీ అక్కడ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర బస చేశారు.
మన దేశంలో ఎన్నో చూడదగిన విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది మహారాష్ట్రలోని పండరీపుర్ దేవాలయం. స్థానికంగా ఇక్కడ ప్రజలు పాండురంగ స్వామిని విఠలుడు అని పిలుచుకుంటారు. అధ్యాత్మిక టూరిజంలో భాగంగా పండరీపుర్, షిరిడీ వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
CM KCR: పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని అన్నారు. ఇప్పటికి బ్రాహ్మణుల్లో చాలామంది పేదలున్నారని.. బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు.
చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణలోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పోలీసు నియామక చివరి రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్పిఎస్సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో డీ-అడిక్షన్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రత్యేక డి-అడిక్షన్ సెంటర్లు, ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇవి వ్యక్తులకు ఉచిత మానసిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.
ఐటీ అధికారులమని చెప్రి సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్లో పట్ట పగలు భారీ దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రామోజీ సంస్థల అథినేత రామోజీ రావుకు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు హోమ్ శాఖ సీఐడీని అనుమతించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.