Last Updated:

Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి.. బోల్తా పడింది. ఆ సమయంలో కారులో 7 ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన  వారిని సమీపం లోని ఆస్పత్రికి తరలించి

Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి.. బోల్తా పడింది. ఆ సమయంలో కారులో 7 ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన  వారిని సమీపం లోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ దుర్ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏడుగురు యువకులు కారులో మంత్రాలయం బయలుదేరారు. కాగా జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారు వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి.. బోల్తా పడింది. దీంతో స్పాట్ లోనే ఇద్దరు చనిపోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను ఆలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. యువకులు వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర గాయాలు అయిన వారిని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించారు. ఈ విషాద వార్తతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.