Home / అంతర్జాతీయం
మూడు సంవత్సరాల తరువాత విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. మార్చి 15 నుండి వివిధ రకాల వీసాల జారీని పునఃప్రారంభిస్తామని తెలిపింది. కోవిడ్ నేపధ్యంలో గత మూడేళ్లుగా విదేశీ పర్యాటకులను చైనా అనుమతించలేదు.
యునైటెడ్ స్టేట్స్ ఈ సంవత్సరం ఒక మిలియన్ భారతీయులకు వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.యుఎస్ మిషన్ భారతదేశంలోని మా ఎంబసీ మరియు కాన్సులేట్లలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది
ఇస్లామాబాద్లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం పిటిఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మహిళా అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు సీనియర్ పోలీసు అధికారులపై బెదిరింపు పదజాలం ఉపయోగించిన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యూకేలో జూనియర్ డాక్టర్లు మూడు రోజుల సమ్మె ప్రారంభించారు.ద్రవ్యల్బణానికి తగ్గట్టు తమ వేతనాలు లేవని వారు అంటున్నారు.
తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్లో శనివారం 47 మందితో ప్రయాణిస్తున్న పడవ తీరంలో బోల్తా పడటంతో కనీసం 22 మంది వలసదారులు మరణించారు. మడగాస్కర్ పోర్ట్ అథారిటీ దీనిపై మాట్లాడుతూ, ఫ్రెంచ్ ద్వీపమైన మయోట్కి వెళ్లేందుకు ప్రయత్నించిన పడవ బోల్తా పడిందని తెలిపారు.
తోషాఖానా బహుమతులు చాలా కాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా ఉన్నాయి. ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం తోషాఖానా లేదా పాకిస్తాన్ ఖజానా రికార్డులను బహిరంగపరిచింది.
పెద్ద ఎత్తున డిపాజిటర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది మరువక ముందే అమెరికాలో మరో బ్యాంక్ దివాలా తీసింది.
సౌదీ అరేబియా యొక్క ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల రంజాన్ మాసంలో దాని పౌరులు అనుసరించాల్సిన కొత్త నిబంధనలను నిర్దేశించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాన్లో పాఠశాల విద్యార్థినులపై అనుమానాస్పద విషప్రయోగాలకు సంబంధించి పలు నగరాల నుండి 100 మందికి పైగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో శత్రువు ఉద్దేశాలు ఉన్న వ్యక్తులు, ప్రజలు మరియు విద్యార్థులలో భయం మరియు భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు.
ట్విట్టర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టెక్సాస్ వెలుపల ఆస్టిన్ ప్రాంతంలో తన సొంత పట్టణాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక భూమి రికార్డులు మరియు దస్తావేజులను ఉటంకిస్తూ ఇది కొలరాడో నది వెంబడి ఉంటుందని వెల్లడించింది.