Last Updated:

Kiara-Sidharth Wedding: కియారా – సిద్దార్థ్ పెళ్లి కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా? టాలీవుడ్ నుంచి వారికి ఆహ్వానం?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Kiara-Sidharth Wedding: కియారా – సిద్దార్థ్ పెళ్లి కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా? టాలీవుడ్ నుంచి వారికి ఆహ్వానం?

Kiara-Sidharth Wedding: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అనంతరం బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని అక్కడే సెటిల్ అయ్యింది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎట్టకేలకు తన ప్రేమికుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకోబోతుందని తెలిసినప్పటి నుండీ ఈ జోడీ పెళ్లి గురించే బిటౌన్‌లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ జంట వివాహం ఫిబ్రవరి 4, 5, 6వ తేదీల్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు.

కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా కలసి ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు.

ఫిబ్రవరి 6న మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదికగా వీరి వివాహం జరగబోతోంది.

ఇందుకోసం సూర్యగఢ్ ఫైవ్ స్టార్ హోటల్‌ అందంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో పెళ్లికి హాజరయ్యే బంధు మిత్రులకు నూతన పెళ్లి జంట ఓ కీలక విజ్ఞప్తి చేసిందట.

తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని కోరిందట. హోటల్ సిబ్బందికి కూడా ఇదే విషయాన్ని చెప్పిందట.

తమ అభ్యర్థనను దయచేసి పాటించాలని కోరిందట. గతంలో విక్కీ, కత్రినా సైతం తమ పెళ్లి సందర్భంగా బంధుమిత్రులకు ఇలాంటి విజ్ఞప్తి చేశారు.

టాలీవుడ్ నుంచి ఆ ఇద్దరికే ఆహ్వానం..

స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుంది. ఇప్పటికే హల్దీ వేడుకలు మొదలయ్యాయి.

జైసల్మేర్ వేదికగా జరుగుతున్న ఈ వివాహ వేడుకకు సిద్, కియారా కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారట.

వీరిలో కొంత మంది దర్శకులు, నిర్మాతలు, సినీ నటీనటులు ఉన్నారట.

కరణ్ జోహార్, అశ్విని యార్డి, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని, షాహిద్ కపూర్ దంపతులు ఈ పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ వెళ్లనున్నట్లు సమాచారం.

అయితే  బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌తో పాటు దాదాపు 150 మంది వీవీఐపీలు ఈ పెళ్లికి హాజరుకాబోతున్నారట.

అతిథుల కోసం లగ్జరీ కార్లు, రాజస్థానీ వంటకాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్‌కు భారీ మొత్తంలో ఖర్చు కానుందని తెలుస్తోంది.

మూడు రోజుల ఈ పెళ్లి వేడుకకు ఏకంగా రూ.6 కోట్లకు పైగానే ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలిపితే ఈ లెక్క రూ.8 నుంచి రూ.10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బిటౌన్‌లో జరిగే రిచెస్ట్ వెడ్డింగ్స్‌లో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి కూడా ఒకటిగా నిలవనుంది.

ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్..

పెళ్లి వేడుక జైసల్మేర్ లో జరగనుండగా, ముంబైలో తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం సిద్ధార్థ్, కియారా గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయట.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/