Home / క్రైమ్
ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
హైదరాబాద్ శివార్లలోని ఎల్బి నగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ళుగా ఆర్టీసీ కాలనీలో హోమియోపతి వైద్యురాలు సంఘవి, ఆమె తమ్ముడు చింటు ఉంటున్నారు. ఆర్టీసీ కాలనీలో ఇంట్లో ఉన్న అక్కా తమ్ముడిపై ఈ మధ్యాహ్నం రామాంతాపూర్కి చెందిన శివకుమార్ కత్తితో దాడి చేసి పొడిచాడు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్యూటర్ను చంపినందుకు 14 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యూటర్ బాలుడిని నిత్యం దుర్భాషలాడేవాడని వాటిని వీడియో కూడా తీశాడని పోలీసులు తెలిపారు.పేపర్ కట్టర్ తో హత్య చేసిన మూడు రోజుల తర్వాత బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
కోరుట్ల యువతి దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. చెల్లి చందనను హంతకురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ప్రియుడు షేక్ ఉమర్ సుల్తాన్తో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో మల్లవ టాలీవుడ్ కి లింకు లు ఉండడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు.
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు.
ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి
జార్ఖండ్లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు చేధించారు. దీనికి సంబంధించి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.మీర్ పేట్ మైనర్ బాలిక పై హత్యాచారం చేసిన కేసు లో ఆరుగురిని ఆరెస్ట్ చేసామనిమరొక వ్యక్తి పరార్ లో ఉన్నాడని తెలిపారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందన వనం లో ఈ సంఘటన జరిగింది..