Published On:

Scam: ఏపీలో మరో భారీ స్కాం… యానిమేషన్ పేరుతో రూ. 500 కోట్ల మోసం

Scam: ఏపీలో మరో భారీ స్కాం… యానిమేషన్ పేరుతో రూ. 500 కోట్ల మోసం

AP: ఏపీలో మరో భారీ స్కాం బయటపడింది. సినిమా యానిమేషన్ పేరుతో సుమారు రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపిక్స్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్లల్లో పెట్టుబడులు పెట్టించి కిరణ్ మోసానికి పాల్పడ్డాడు.

 

వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నేర్పుతామని నమ్మించి సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. కిరణ్ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన ఆరుగురు గత ఏప్రిల్ నెలలో సత్యానారయణపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇదే కేసు విషయంలో ప్రకాశం జిల్లాకు చెందిన 80 మందికి పైగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే పరారీలో ఉన్న కిరణ్ ను యర్రగొండపాలెం పోలీసులు ఉత్తరాఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పీటీ వారెంట్ పై విజయవాడ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వెలుగు చూసిన స్కాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. అలాగే ఓ మాజీ పోలీసు అధికారి హస్తం కూడా ఉన్నట్టు వివరాలు తెలిశాయని పోలీసులు తెలిపారు.