Solar Power AP: 2030 నాటికి 500 గిగా వాట్ల సోలార్ విద్యుత్: సీఎం చంద్రబాబు
500 Gigawatts of Solar Power by 2030 to AP: 2030 నాటికి 500 గిగా వాట్ల మేర దేశీయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం సమగ్రమైన సోలార్ ఉత్పత్తి పాలసీని తీసుకు వచ్చిందని తెలిపారు. దీనితో ఏపీ ఇండియాలో సోలార్ ఉత్పత్తి కేంద్రంగా మారుతోందని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని తయారీ సంస్థలను తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు, దీనితో లక్షలాదిమందికి ఉద్యోగాల కల్పనతోపాటు ఇండియాను హరిత ఇందన వినియోగం వైపు నడిపిస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Our country’s ambitious target of 500 GW by 2030 is driven by a clear focus to develop indigenous manufacturing capabilities across the solar value chain. The Govt. of AP has developed a comprehensive policy framework to encourage solar manufacturing. I am happy that this is… pic.twitter.com/9RQVDbF9XX
— N Chandrababu Naidu (@ncbn) May 26, 2025
నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత మే నెలలోనే రాష్ట్రానికి నైరుతి పలకరింపు శుభ పరిణామమని అన్నారు. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం కావాలన్నారు. రైతులకు, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాని చంద్రబాబు అన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రైతన్న బాగుంటాడని అన్నారు. అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.