Published On:

DK Aruna as Chairperson: డీకే అరుణకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం!

DK Aruna as Chairperson: డీకే అరుణకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం!

DK Aruna as Chairperson: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్సులేటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.