Balochistan bus attack: స్కూల్ బస్సు దాడిని భారత్ కు ముడిపెట్టిన పాక్..! తిప్పి కొట్టిన భారత్
Balochistan bus attack: తలా తోకా లేని నిందలు వేయడంలో పాకిస్తాన్ దిట్ట. అసలు పాకిస్తాన్ ను ఆ దేశాధినేతలు తలకాయపెట్టి నడిపిస్తున్నారా లేదా అన్నదే సందేహం. తాజాగా పాకిస్తాన్ లో ఓ పాఠశాల బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. తోచిందే తడవుగా పిల్లల బస్సుపై భారత్ ఆత్మాహుతి దాడి చేసిందని గగ్గోలు పెడుతోంది. దీంతో భారత్ తీవ్రంగా ఖండించింది. చేతగానితనాన్ని పక్కవారిపై వేయడం పాక్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఆరోపణలు చేస్తోందని భారత్ స్పష్టం చేసింది. అంతేకాక తన స్థానిక సమస్యలపై భారత్ ను నిందించడం పాక్ కు అలవాటైందని మండిపడింది.
పిల్లల బస్సుపై భారత్ దాడి చేసిందనడం హాస్యాస్పదం. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడికి తీవ్రంగా స్పందించిన భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది. అందులో భాగంగా పాకిస్తాన్ జనావాసాల మధ్య తీవ్రవాదులు ఉన్న బిల్డింగులను గురిచూసి కొట్టింది. ఏ ఒక్క సివిలియన్ పై బాంబులు పొరపాటున కూడా తగలకుండా శ్రద్దగా కొట్టింది. అందులో 100కు పైగా తీవ్రవాదులు, 10కి పైగా ఉగ్ర స్థావరాలు ద్వంసం అయ్యాయి. అలాంటిది ఇప్పుడు అబంశుభం తెలియని స్కూలు పిల్లల బస్సుపై భారత్ దాడి చేసిందనడం నిజంగా పాకిస్తాన్ వెకిలి మెదడుకు నిదర్శనం.
ఇప్పటికే ఖుజ్దర్ లో పిల్లల బస్సుపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వారికి భారత్ సంతాపం తెలియజేసింది. ఉగ్రవాదులను తయారు చేసే పాకిస్తాన్, తన సైన్యంలోనే ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పించే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ పై పడి ఏడుస్తుంది. రెండు దేశాల స్వాతంత్రం ఒకే సారి వచ్చినా, ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఏబ్రిటన్ అయితే గతంలో భారత్ ను ఏలిందో అదే బ్రిటన్ కంటే జీడీపీ ఎక్కువగా నమోదు చేసింది. పాకిస్తాన్ మాత్రం ప్రపంచం దృష్టిలో తీవ్రవాద దేశంగా మిగిలిపోయింది.
బలోచిస్తాన్ లోని ఖుజ్దార్ లో ఓపాఠశాల బస్సుపై బాంబు దాడి జరిగి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 38మంది తీవ్రంగా గాయపడ్డారు.