Rain Alert to Telangana: భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు!

Rain Alert to Telangana State: తెలంగాణలో ఇవాళ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సిద్దిపేట, యాదాద్రి, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో లు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇంటి బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం కురవడంతో లోతట్టు జలాలు నీటమునిగాయి. మాదాపూర్, కేపీహెచ్బీ, పటాన్ చెరు, మియాపూర్, బోరబండ, హఫీజ్ పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, బాలానగర్, ఎల్బీనగర్, సనత్ నగర్, మూసాపేట్, పంజాగుట్ట, శ్రీనగర్ వంటి కాలనీల్లో వర్షం కురిసింది.
ఈ వర్షానికి రోడ్లు జలమయ్యాయి. దీంతో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.