AP High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. ప్రత్యేకంగా వెకేషన్ కోర్టులు!

AP High Court Holiday from Today: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు నేటి నుంచి జూన్ 13 వరకు ఉండనున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 16 నుంచి హైకోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచే అన్ని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ఈ వేసవి సెలవుల్లో హైకోర్టు పలు కీలక అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేకంగా వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఇందులో తొలి దశ వెకేషన్ కోర్టుల విషయానికొస్తే.. మే 15, 22, 29వ తేదీల్లో విచారించనున్నారు. అయితే మే 15, 22వ తేదీల్లో మాత్రం లాయర్లు జస్టిస్ సురేశ్ రెడ్డితో పాటు జస్టిస్ లక్ష్మణ రావులు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేపట్టనున్నారు.
అలాగే, మే 29వ తేదీన లాయర్లు జస్టిస్ హరినాథ్తో పాటు జస్టిస్ లక్ష్మణరావులు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణ రంజన్ సింగిల్ బెంచ్గా కేసులకు సంబంధించి విచారణ చేయనున్నారు. ఇక, రెండో దశ వేకేషన్ కోర్టుల విషయానికొస్తే.. జూన్ 5, 12వ తేదీల్లో విచారణలు చేపట్టనున్నారు. ఈ తేదీల్లో లాయర్లు జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ శేఖర్లు డివిజన్ బెంచ్గా జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్గా కేసులను విచారించనున్నారు.