Published On:

PM Modi : గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన కూటమి నేతలు

PM Modi : గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన కూటమి నేతలు

PM Modi : రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్‌లో వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలుకుతారు.

హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా రోడ్‌ షోగా బయల్దేరి ప్రధాన వేదిక వద్దకు ప్రధాని మోదీ చేరుకుంటారు. మోదీ చేతుల మీదుగా అమరావతిలో రూ.58వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన సభావేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగు వారి వైభవం, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: