Last Updated:

Minor Raped: రాష్ట్రంలో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై 3రోజులుగా సామూహిక అత్యాచారం

Minor Raped: రాష్ట్రంలో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై 3రోజులుగా సామూహిక అత్యాచారం

Minor Raped in Andhra Pradesh: రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై గత మూడు రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక(14) ఇంటి పక్కన ఉండే ఓ మహిళతో కలిసి వారి బంధువుల ఇంటికి వచ్చింది.

అయితే 13న ఆ మహిళ పుట్టింట్లో వివాదం జరగగా.. ఆ విషయాన్ని పక్కన ఉన్న మరో ఇంట్లో బాలికి చెప్పింది. దీంతో ఆ మహిళ తల్లి బాలికపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. బాలిక బయటకు వస్తుండగా.. ఇద్దరు యువకులు బైక్‌పై ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి ఆ బాలికిను ఎక్కించుకొని రేప్ చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు యువకుల వద్దకు తీసుకెళ్లగా.. వారు కూడా లైంగిక దాడి చేశారు. అనంతరం మరో ఇద్దరితో పాటు ఓ యువకుడు కూడా ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇక, ఆ బాలికను గమనించిన ఓ ఆటో డ్రైవర్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం బాలికను ఎన్టీఆర్ జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేర్చాడు. కాగా, ఆ బాలిక మాట్లాడలేని పరిస్థితి ఉండడంతో పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

తొలుత ఆ బాలికను ఇద్దరు యువకులు బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరిని పట్టుకొని విచారించగా.. వీరపనేనిగూడెం ప్రాంతానికి చెందిన జితేంద్ర, సంజయ్, ఓ మైనర్ బాలుడు, కేసరపల్లికి చెందిన అనిల్, తేలప్రోలుకు చెందిన హర్షవర్ధన్ తో పాటు మరో ఇద్దరు అత్యాచారం చేసినట్లు తేలింది.ఈ మేరకు ఈ కేసులో 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల్లో ఒకరు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి: