Narendra Modi: మహా కుంభమేళాలో మోదీ.. పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
PM Narendra Modi Visits Mahakumbh Mela-2025 in UP: ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళా చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాగరాజ్లోనిత్రివేణీ సంగమ స్థలి వద్ద అమృత స్నానం ఆచరించారు. హెలికాప్టర్లో కుంభమేళా ప్రాంగణానికి చేరుకున్న మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం అక్కడినుంచి ఇద్దరు కలిసి అరెయిల్ ఘాట్ నుంచి పడవలో గంగ, యమున, సరస్వతి కలిసే త్రివేణీ సంగమం వద్దకు బోటులో వెళ్లారు. అక్కడ మంత్రోచ్ఛరణల మధ్య పుణ్య స్నానం ఆచరించారు. అయితే తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో దిగారు.