Home / తెలంగాణ
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సినీనటి దివ్య వాణి కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలవడం పట్ల ఆసక్తి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హాస్పిటల్ దోపిడీని బయటపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడంటూ ట్రీట్మెంట్ చేసి బతికించాలని ఓ శవాన్ని డాక్టర్ల వద్దకు చిరంజీవి తీసుకెళ్తారు.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిలేని వానలు కురుస్తున్నాయి. కాగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదనీటి ప్రవాహాన్ని తాళలేక సాగర్ ఎడమ కాలువకు గండి పడింది.
ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్లో2019తో పోల్చితే 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారుల మరణాలు 276% పెరిగాయి. ఇది దేశంలోని 53 నగరాల్లో 2019లో 22 నుండి ఏడవ స్థానానికి చేరుకుంది. అయితే పాదచారుల గాయాల పరంగా (590), హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
గత నాలుగు రోజులుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తు వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. కాగా ఈ వానల దాటికి చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.
ఏపీ, తెలంగాణలో ప్రముఖ రాజకీయ ముఖ్య నేతలు అయిన చంద్రబాబు నాయుడు మరియు సీఎం కేసీఆర్ లకు హర్యానా రాష్ట్రం ఆహ్వానం పలికింది. ఈ నెల 25న భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) భారీ ర్యాలీ నిర్వహించనుంది.
తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.