Home / Telangana
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల వేడి కొనసాగుతుంది. కారు-కమలానికి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో మరోమారు బీజేపీకి వ్యతిరేకంగా అంటించి ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది హడలెత్తారు. ఓ త్రాచుపాము ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకొనింది
దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నిర్మించనున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని పూర్తిచేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
మునుగోడు ఉపన్నిక తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఎవరకి ఈ నియోజకవర్గ పట్టం కడతారానా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మునుగోడు బైపోల్ కు సంబంధించి నామినేషన్ల పర్వం తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల్లో భాగంగా నేడు నేత్ర దర్శనంలో కనువిందుచేసిన శ్రీవారిని వీక్షించిన భాగ్యనగరవాసులు తన్మయత్నంలో మునిగిపోయారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.
తెలంగాణ రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో నేటినుంచి విధుల్లో చేరాలని విఆర్ఏలు నిర్ణయించారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను సంభోదిస్తూ వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.