Home / Telangana News
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అద:పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రగతిభవన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన […]
Case against Sigachi owner:పాశమైలారం ఘటనపై కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం ఫార్మాకంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా.. 30 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని మృత దేహాలు శిథిలాల కింద ఉంటే అవకాశం ఉండడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బాధిత కుటుంబానికి చెందిన సాయియశ్వంత్ పోలీస్ […]
ACB Raids in Telangana: తెలంగాణలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, బెంగళూరులోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నూనె శ్రీధర్ పనిచేశారు. ఈ ప్రాజెక్టులో 6, 7 […]
Minister Uttam kumar reddy good news about farmers bonous amount: రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెండింగ్లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన ‘రైతు మహోత్సవం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందనే విషయం స్థానిక ఎంపీ అరవింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి […]
Big Twist in Phone Tapping Case Accused Sravan Rao Attended To SIT: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరవ నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా ఆయన దుబాయ్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. […]
Speaker vs Minister an Interesting Scene National karate event in Hyderabad: హైదరాబాద్లో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 4వ కియో జాతీయ కరాటే పోటీలకు ముఖ్యఅతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కరాటేలో ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. అయితే ఈ […]
Telangana Government Key Announceme For Ration Consumers: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని హుజూర్ నగర్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. […]
Telangana Assembly Budget Sessions Begins From Today: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉదయం 11 గంటలకు తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ సెలవు కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అయితే మరోవైపు ఈ సభను గురువారానికి వాయిదా […]
BJP Leader Arvind with his New Bride: హైదరాబాద్లో బీజేపీ నేత చేసిన నిర్వాహం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్వాన్ నియోజకవర్గ గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురాజాల అరవింద్ కుమార్.. ఓ నవ వధువుతో పరారయ్యాడు. కాగా, ఆయనకు ఇప్పటికే వివాహం కావడంతో పాటు పాప కూడా ఉంది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అరవింద్ కుమార్(46)కు లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో ఉంటున్న ఓ యువతి గత కొంతకాలంగా పరిచయం […]
Half Day Schools in Telangana from 15th March: సమ్మర్ రాకముందే భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి పాఠశాలలను ఒంటిపూట నడపాలని నిర్ణయించింది. ఇక, తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు చిరు వ్యా పారులు […]