Home / crime
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని కుర్మానగర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దివ్య అనే మహిళను భర్త దీపక్ కుమార్ దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి కిరాతంగా చంపేశాడు.
ఖమ్మంలో సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను ఏపీలో అరెస్ట్ చేశారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా, పోలీసులు ఎనిమిది మందిని ఈ కేసుల
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ.. తమ్మినేని కోటేశ్వర్రావు ఇంటిపై గ్రామస్తులు దాడికి దిగారు. కోటేశ్వర్రావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు.
హరియాణాలో అక్రమ మైనింగ్ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్ జిల్లా పచ్గావ్ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఓ బాలిక ఆదివారం పాఠశాల భవనం పైనుంచి దూకి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించే నేపధ్యంలో ఆమె భవనంపై నుంచి దూకింది. బాధితురాలి సోదరుడి వాంగ్మూలం ఆధారంగా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని కళింగ నగర్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఓ చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి.. అక్కడి కూలీలు, యువకులకు రోజు కూలీ ఇచ్చి క్రికెట్ ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి ఐదు హెచ్డీ కెమెరాలను కూడా ఉపయోగించారు.