Home / BJP
మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారంటూ తెలంగాణ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు బుధవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా లేఖ పంపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని, రోజ్ గార్ మేళాతో తెలిసివచ్చిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు సీఎంలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ నేతలు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలనపై ధ్వజమెత్తారు.
కర్ణాటకలోని దొడ్డలహళ్లిలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మను ముద్రించడంతోవివాదం చెలరేగింది.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.