Last Updated:

Pawan Kalyan: వైసీపీ ట్రాప్ లో పడని జనసేనాని

వైసీపీ మంత్రులు పదే పదే పవన్‌ కల్యాణ్‌ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా?

Pawan Kalyan: వైసీపీ ట్రాప్ లో పడని జనసేనాని

Andhra Pradesh: వైసీపీ మంత్రులు పదే పదే పవన్‌ కల్యాణ్‌ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా? వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా పవన్ వ్యూహం అదేనా?

పవన్ కల్యాణ్‌ని వైసీపీ కాపు మంత్రులు రెచ్చగొడుతున్నారు. అది ఇవాళ కొత్తగా కాదు చాలా కాలంగానే ఆయన మీద మంత్రులు మాజీ మంత్రులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా సత్తా ఉందా అంటూ సవాల్ చేస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్‌ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఎవరి కోసమో, లేక ఎవరో ఏదో రెచ్చగొట్టారనో తన రాజకీయాలు తన వ్యూహాలు మార్చుకోరు. పవన్‌కు ఏపీలో వైసీపీ ఉండకూడదు అది ఫస్ట్ టార్గెట్. ఆ తరువాతనే ఆయనకు పదవులూ మరేదైనా. నిజానికి పవన్ చాలా సార్లు తన పార్టీ కార్యకర్తల సమావేశంలోనే చెప్పుకొచ్చారు. తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యం అభివృద్ధి ముఖ్యమని. ఆ విధంగా తరచూ చెప్పడం ద్వారా ఆయన వారిని బాగానే మౌల్డ్ చేశారనుకోవాలి.

ఇక కాపు యువత పవన్ వెంట పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా పవన్ ఏమన్నా సై అంటారు. పవన్ సీఎం కావాలన్నదే వారి చిరకాలవాంఛ. ఇలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ జనసేనలో ఉన్నారు. అందువల్ల వారంతా పవన్ ఫిలాసఫీనే తాము వంటబట్టించుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఇపుడు వైసీపీకి ఇబ్బంది వస్తోంది. పవన్ సీఎం అవాలని పార్టీ వారు అనుకుంటే ఆయన మాత్రం తాను తగ్గి చంద్రబాబుని గెలిపిస్తున్నారు అని, దీన్ని జనసేన నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా, వైసీపీ నేతలు 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందా అని మళ్లీ అదే ప్రశ్న వేస్తున్నారు. మరో వైపు జగన్, పవన్ దాదాపుగా ఒకే ఈడు వారు. అందువల్ల ఏ విధంగా చూసుకున్నా జగన్ తనకు బలమైన ప్రత్యర్ధిగా పవన్ కల్యాణ్‌నే చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలవకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే పదే పదే పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలతోనే జగన్ ని ఇంటికి పంపించాలని జనసేనాని దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే వైసీపీ నేతలు చేస్తున్న దందాలను ప్రజలకు తరచూ గుర్తు చేస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెబుతున్నారు.

మొత్తానికి పవన్ కల్యాణ్‌ మార్క్ స్ట్రాటజీ కరెక్ట్ అనిపిస్తోంది. ఆయన వైసీపీ ట్రాప్ లో పడలేదు. అందుకే వైసీపీ వారు ఎంత రెచ్చగొట్టినా ఆయన పొత్తులతోనే వస్తారు అని అంటున్నారు. పొత్తులు కనుక ఉంటే వైసీపీకి అది ఓటమినే కలిగిస్తుంది అని ఆ పార్టీ కంగారు పడుతోంది. మొత్తానికి వైసీపీ చేతిలో ఇంకా ఏడాదిన్నర అధికారం ఉందనగానే వారిలో కలవరం రేపిన ఘనత మాత్రం పవన్ కే దక్కుతుంది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇవి కూడా చదవండి: