Last Updated:

Lok Sabha: లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీల సస్పెన్షన్ ..

స్పీకర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రవర్తిస్తున్నారంటూ లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేసారు.సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్‌సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు.

Lok Sabha: లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీల సస్పెన్షన్ ..

Lok Sabha:స్పీకర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రవర్తిస్తున్నారంటూ లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేసారు.సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్‌సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్‌ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తీసుకొచ్చారు.

141 కు చేరిన ఎంపీల సంఖ్య..(Lok Sabha)

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దిగువ సభలో మాట్లాడుతూ సభలోనికి ప్లకార్డులు తీసుకురాకూడదని నిర్ణయించారు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశ కారణంగా, వారు అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అందుకే మేము ఒక ప్రతిపాదనను (ఎంపీలను సస్పెండ్ చేయడానికి) తీసుకువస్తున్నామని అన్నారు. దీనితో పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయిన మొత్తం ఎంపీల సంఖ్య 141కి చేరింది.సోమవారం 46 మంది ఆప్ ఎంపీలు లోక్ సభ నుంచి, 45 మంది రాజ్యసభ ఎంపీలు సస్పెండ్ అయ్యారు.ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్లు కొనసాగుతుండగా, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు లేఖ రాశారు.

నమోక్రసీ..

ప్రతిపక్ష నాయకులు సామూహిక సస్పెన్షను తీవ్రంగా విమర్శించారు. అధికార బీజేపీ అసమ్మతిని అణచివేయడం మరియు పార్లమెంటరీ ప్రసంగాలను అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.ప్రమాదకరమైన బిల్లులను అర్థవంతమైన చర్చ లేకుండానే ఆమోదించేలా ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. డిసెంబర్ 13న ఇద్దరు నిందితులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపిలను వదిలిపెట్టడానికి కూడా ఇది జరుగుతోంది. అన్ని రకాల దౌర్జన్యాలతో కొత్త పార్లమెంట్‌లో ‘నమోక్రసీ’ వెలుగులోకి వస్తోంది అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ చైర్మన్‌ను ప్రతిపక్ష ఎంపీలు అవమానించినందున ఈ చర్య తప్పనిసరి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు తమ ప్రవర్తనతో దేశాన్ని అవమానించాయని ఆరోపించిన గోయల్, ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు తెచ్చి ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని అన్నారు.