Last Updated:

Isro Spy Case: ఇస్రో గూఢచర్యం కేసు: మహిళ తన కోరికను తిరస్కరించడంతో మాజీ శాస్త్రవేత్తలను ఇరికించిన పోలీసు అధికారి

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.

Isro Spy Case: ఇస్రో గూఢచర్యం కేసు: మహిళ తన కోరికను తిరస్కరించడంతో మాజీ శాస్త్రవేత్తలను ఇరికించిన పోలీసు అధికారి

Isro Spy Case: 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. సుప్రీంకోర్టు ఆదేశం ఆధారంగా, 1994 కేసు వెనుక ఆరోపించిన కుట్రపై సీబీఐ 2021లో దర్యాప్తు ప్రారంభించింది. గత వారం తిరువనంతపురంలోని కోర్టులో సీబీఐ తన ఛార్జిషీట్‌ను సమర్పించింది.

మహిళ తిరస్కరించడంతో..(Isro Spy Case)

అప్పటి రాష్ట్ర పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారిగా పనిచేసిన ఎస్‌ విజయన్‌ తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో మాల్దీవులకు చెందిన ఓ మహిళతో లైంగిక సంబంధానికి డబ్బులు ఇవ్వగా అమె తిరస్కరించింది. తరువాత అతను ఆమె గురించి సమాచారాన్ని సేకరించినట్లు సిబిఐ తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్త డి శశికుమారన్‌తో ఆమెకు ఫోన్‌లో పరిచయం ఉందని తెలుసుకున్న తర్వాత విజయన్ గూఢచర్యానికి సంబంధించిన కథనాన్ని రూపొందించారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.విజయన్, మాల్దీవుల మహిళ ప్రయాణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారని మరియు ఆమె తన దేశానికి తిరిగి వెళ్లకుండా నిరోధించారని కూడా పేర్కొంది.దేశంలో ఎక్కువ కాలం గడిపినందుకు పోలీసులు మొదట్లో ఆమెపై కేసు నమోదు చేశారు, అయితే అధికారిక రహస్యాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను చేర్చిన తర్వాత కేసును గూఢచర్యం కేసుగా మార్చారు. అనంతరం , ఇస్రో శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, డి శశికుమారన్ మరియు కె చంద్రశేఖరన్ మరియు కాంట్రాక్టర్ ఎస్ కె శర్మలను అరెస్టులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన కేరళ పోలీసులోని అప్పటి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సిబి మాథ్యూస్ ఆదేశాల మేరకు జరిగాయి.

కస్టడీలో చిత్రహింసలు..

రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అరెస్టయిన వారిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు శారీరక మరియు మానసిక హింసకు గురి చేసేందుకు మాథ్యూస్ అనుమతించారని సీబీఐ ఆరోపించింది. అరెస్టయిన శాస్త్రవేత్తలను, ఇతరులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రశ్నించినప్పటికీ, ఎలాంటి విచారణ నివేదికను తయారు చేయలేదు.నంబి నారాయణన్, కె చంద్రశేఖర్‌లకు పోలీసు కస్టడీలో వైద్య చికిత్స అందించగా, అది క్రైమ్ రికార్డుల్లో నమోదు కాలేదు. మాథ్యూస్‌ ఆదేశాల మేరకు మరో నిందితుడు డీవైఎస్పీ కేకే జోష్వా మెడికల్‌ రికార్డులను అటకెక్కించారని సీబీఐ పేర్కొంది.కేరళలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌ నిందితులను అనధికారికంగా కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో నాల్గవ నిందితుడు అయిన శ్రీకుమార్ కూడా హోటల్ గదిలో మాల్దీవుల మహిళను అనధికారికంగా ప్రశ్నించడంలో చురుకైన పాత్ర పోషించాడని, అతని ఆదేశాల మేరకు జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వ్యవహరించారని సీబీఐ పేర్కొంది. మరో ఐబీ అధికారి, ఐదో నిందితుడు పీఎస్ జయప్రకాష్ నంబి నారాయణన్‌ను చిత్రహింసలకు గురిచేశారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఇది ప్రాథమిక దశ నుండి చట్టం/అధికార దుర్వినియోగానికి సంబంధించిన స్పష్టమైన కేసు. ప్రాథమిక తప్పులను కొనసాగించడానికి, బాధితులపై తప్పుడు విచారణ నివేదికలతో తీవ్రమైన స్వభావం గల మరొక కేసు ప్రారంభించబడింది. ఈ తప్పుడు విచారణ నివేదికలను శాస్త్రవేత్తలతో సహా ఇతరుల అరెస్టుకు ఉపయోగించారని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కుట్రలో మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్స్ (డీజీపీలు) ఆర్ బీ శ్రీకుమార్, సీబీ మాథ్యూస్, మాజీ ఎస్పీలు ఎస్ విజయన్, కేకే జాషువా, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి పీఎస్ జయప్రకాశ్‌లను విచారించాలని సీబీఐ తన తుది నివేదికలో సూచించింది.

ఇవి కూడా చదవండి: